Home » BJP
బెంగాల్లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన బీజేపీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనకు న్యాయమూర్తిపై నమ్మకం పోయిందని.. అందుకే మద్యం కేసు విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట నేడు హాజరుకాబోనని చెప్పారు.
కల్వకుంట్ల కవిత విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. తమది బానిసత్వ పార్టీ కాదని, పార్టీ పేరుతో కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.
లోధి ఎస్టేట్ ప్రభుత్వ బంగ్లాలోకి ఇటీవల మారిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి బీజేపీ విమర్శలు గుప్పించింది. తన అధికారిక నివాసాన్ని ప్రైవేటు మనీతో లగ్జరీ ఇల్లుగా మార్చుకున్నారని, రెండో శీష్ మహల్ నిర్మించుకున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది.
ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాఘవ్ చద్దా రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరనున్నట్లు చద్దా తెలిపారు.
నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణం కేంద్ర మంత్రి బండి సంజయ్ అని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ మృతిని కేంద్ర మంత్రి రాజకీయం చేస్తున్న తీరు హేయనీయం, సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
సామూహిక వందేమాతర గీతాలాపన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసి ఆహ్వానించినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి చెప్పారు. బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.