Home » Bihar
బిహార్ ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లతో ఘోరమైన పరాజయం చవిచూసిన నేపథ్యంలో లాలూ కుటుంబంలో సంక్షోభం మొదలైంది. ఆర్జేడీ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు తనపై తేజస్వి, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ తనను అవమానించి, దాడి చేశారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర ఆరోపణలు చేశారు.
తేజ్ ప్రతాప్ తన సోదరి రోహిణి వీడియోను ఇన్స్టాగ్రామ్లో జేజేడీ అధికార ఖాతా నుంచి షేర్ చేశారు. తనకు అన్యాయం జరిగితే భరించానని, అయితే తన చెల్లెల్ని అవమానిస్తే మాత్రం మౌనంగా చూస్తూ ఉండేది లేదని హెచ్చరించారు.
ఎన్డీయే ప్రతిపాదించినట్టు చెబుతున్న ఫార్ములా ప్రకారం, బీజేపీకి కేబినెట్లో సింహభాగం వాటా దక్కనుంది. 15 నుంచి 16 మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. జేడీయూకు 14 మంత్రి పదవుల వరకూ దక్కవచ్చు.
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ఇంట్లో విభేదాలు చెలరేగాయి. తాను ఆర్జేడీ పార్టీ, కుటుంబం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన ఆయన కుమార్తె రోహిణి ఆచార్య.. తాజాగా తన సోదరుడు తేజస్విపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బిహార్ ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22న తేదీతో ముగియనుంది. దీనికి ముందే 18వ అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తొలుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గవర్నర్ను కలిసి రాజీనామా సమర్పిస్తారు.
243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 సీట్లకే పరిమితమైంది. 2010 తర్వాత దారుణమైన ఫలితాలు వచ్చిన రెండో సందర్భం ఇది. అప్పటి ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 22 సీట్లు గెలుచుకుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
సీట్ల షేరింగ్ ఫార్ములాలో భాగంగా 143 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసి కేవలం 25 సీట్లలో గెలిచింది. 23 శాతం ఓట్ షేర్ రాబట్టింది. గత ఎన్నికల్లో ఇది 23.11గా ఉంది. గత ఎన్నికల్లోనూ 144 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేసింది.
ఆర్కే సింగ్ ఎన్నికల సమయంలో పలువురు ఎన్డీయే నేతల అవినీతి, ఫ్యాక్షనిజంపైన ఆరోపణలు చేయడంతో పాటు శాంతిభద్రతల నిర్వహణపై ఎన్నికల కమిషన్ను బహిరంగంగానే తప్పుపట్టారు. మొకామాలో జరిగిన హింసాకాండపై ప్రభుత్వ యంత్రాంగం, ఎన్నికల కమిషన్పై విమర్శలు గుప్పించారు.