Home » Bihar
బిహార్లో 2005కు ముందు నిరక్షరాస్యత, నిరుద్యోగత, వలసలు ఉండేవని, ఉన్నత విద్య కోసం ఒక్క మంచి విద్యాసంస్థ కూడా ఉండేది కాదని, యువత చీకట్లో మగ్గేదని నితీష్ తెలిపారు. యువకులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అవమానాలు పాలయ్యేవారని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టో వాగ్దానం చేసింది. మేనిఫెస్టో మొదట్లోనే ఈ హామీ చోటుచేసుకుంది. 20 రోజుల్లో ప్రతి కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది.
వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉండటం, పార్టీ నామినీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు వస్తున్న వార్తలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్టు ఆర్జేడీ ప్రధాన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
మోకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా సింగ్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి, జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి ప్రియదర్శి పీయూష్ పోటీలో ఉన్నారు. మోకామా 2005 నుంచి సింగ్కు కంచుకోటగా ఉంది.
నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర యంత్రాంగం అవినీతిమయమైందని, శాంతిభద్రతలు లోపించాయని తేజస్వి ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని ఎన్డీయే ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ వంటి ప్రముఖులు ఉన్నారు. సచిన్ పైలట్, భూపేష్ బఘేల్, గౌరవ్ గొగోయ్, కన్హయ్య కుమార్, జిగ్నేష్ మేవాని, దిగ్విజయ్ సింగ్, రణ్జీత్ రంజన్, తారిఖ్ అన్వర్ తదితరులు కూడా ఈ జాబితాలో చోటుచేసుకున్నారు.
పార్టీ అధికార ప్రకటన ప్రకారం, బహిష్కరణ వేటు పడిన నేతల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే గోపాల్ మండల్, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సంజీవ్ శ్యామ్ సింగ్, మాజీ మంత్రి శైలేష్ కమార్, మాజీ ఎమ్మెల్సీ సంజయ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం కొద్దిపాటి వ్యవధిలోనే తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సంజయ్ జైశ్వాల్ శనివారంనాడు ఫిర్యాదు చేశారని ఎస్డీపీఓ (బెట్టాయ్ టౌన్) వివేక్ దీప్ తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేస్తున్నట్టు చెప్పారు.
సీతామర్హిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ, ఇది జన్ సురాజ్ జన్మభూమి అని, మూడేన్నరేళ్ల క్రితం పార్టీ పుట్టిందని చెప్పారు. భయంతో బీజేపీకో, లాలూకో ఓటు వేయాల్సిన పనిలేదని, బిహార్లో రాజకీయ వెట్టిచాకిరీకి తాము ముగింపు పలకాలని తమ పార్టీ గట్టిగా తీర్మానించుకుందని తెలిపారు.
మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే బిహార్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రతినిధులకు అలవెన్సులు రెట్టింపు చేస్తామని, రూ.50 లక్షల బీమా, పెన్షన్ సదుపాయాలు కల్పిస్తామని తేజస్వి హామీ ఇచ్చారు. కూటమి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముఖేష్ సహానితో కిలిసి మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.