Home » Bihar Elections 2025
బిహార్లోని సహర్సాలో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో తేజస్వి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన తరగతుల వాణిని వినిపించేందుకు ముఖేష్ సాహ్నీ డిప్యూటీ సీఎంగా ఉంటారని, ఆయనతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన మరింత మంది ఉప ముఖ్యమంత్రులుగా ఉంటారని చెప్పారు.
విపక్ష మహాఘట్బంధన్పై ప్రధాని విమర్శలు గుప్పిస్తూ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఏళ్ల తరబడి బిహార్ను లూటీ చేసిందని, ఇప్పుడు వీరంతా బెయిలుపై ఉన్నారని చెప్పారు.
బిహార్ మహాఘట్బంధన్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే మాటల యుద్ధం మొదలైంది. ఆర్జేడీ నేత అయిన తేజస్వి సవాలుకు ఎన్డీయే నేతలు అంతే రేంజ్ లో విమర్శలు గుప్పించారు.
శ్వేతాసుమన్ 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని చౌందౌలి జిల్లావాసిగా నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. అయితే 2025 ఎన్నికల్లో బిహార్ నివాసిగా పేర్కొన్నారు.
బిహార్లో గత ప్రభుత్వాల హయాంలో శాంతిభద్రతులు, విద్య, మౌలిక వసతులు దయనీయంగా ఉండేవని, తమ నాయకత్వంలో బీహార్లో గణనీయంగా మార్పులు చోటుచేసుకున్నాయని నితీష్ కుమార్ చెప్పారు. మెరుగైన రోడ్లు, విద్యుత్, శాంతిభద్రతలు, ప్రజల మధ్య సామరస్యం పాదుకొల్పామని అన్నారు.
జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్)లకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పిస్తామని, రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మనెంట్ గా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని తేజస్వి యాదవ్ వాగ్దానం చేశారు.
అక్టోబర్ 6న ఎన్నికల ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి అక్టోబర్ 21వ తేదీ వరకూ రూ.71.32 కోట్లు విలువచేసే నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, కీలకమైన మెటల్స్, ఇతర ఉచితాలను ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది.
నితీష్ ఆరోగ్యంపై తేజస్వి కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో నితీష్ కుమార్ తన నివాసం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. టీవీ స్క్రీన్లో మోదీ వైపు చూస్తూ తన రెండు చేతులను జోడిస్తూ నితీష్ ఉండిపోయారు.
శశి భూషణ్ సింగ్ డీసీఎల్ఆర్ కార్యాలయంలో సోమవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీపీఐ వంటి అన్రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది ప్రపోజర్లు నామినేషన్ దాఖలుకు అవసరం.
కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు డిమాండ్ చేస్తుండగా 52 నుంచి 55 సీట్లు ఇస్తామంటూ ఆర్జేడీ ప్రతిపాదించింది. దీంతో ఇరు భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయలోపం తలెత్తింది. ఇదేవిధంగా వామపక్ష పార్టీలు 40 సీట్లు అడుగుతున్నాయి.