Home » BCCI
బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్ 2026’ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ అందుకున్నాడు. అయితే గిల్కు సంబంధించి ఓ విషయంపై రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడిన ఓ వీడియో అనలిస్ట్పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. రంజీ ట్రోఫీ 2024 సీజన్లో రాజా రెడ్డి అనే వ్యక్తి ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతడిపై జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలను సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఊరట లభించింది. బీసీసీఐ నిబంధనను ధోని ఉల్లంఘిస్తున్నాడంటూ దాఖలైన ఫిర్యాదును బీసీసీఐ ఎథిక్స్ అధికారి అరుణ్ మిశ్రా కొట్టేశారు.
గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల తేదీ వచ్చేసింది. మార్చి 12న లీగ్ తొలి 20 రోజుల షెడ్యూల్ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారికంగా ప్రకటించారు.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) టీమ్ ఇండియాకు మంగళవారం 131 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా ధ్రువీకరించారు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆకిబ్ నబీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో నబీ గురించి ఓ కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నబీ ఎంపిక విషయంపై స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్2026 వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టోర్నీలకు భారత ఆటగాళ్లతో కుటుంబాలను అనుమతించకూడదన్న నిబంధనకు కట్టుబడి ఉండాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అండర్-19 ప్రపంచ కప్ 2026లో విశ్వ విజేతగా నిలిచిన యువ భారత్కు బీసీసీఐ రూ.7.50 కోట్ల నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.