Home » Bangladesh Cricketers
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బిగ్ షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్ 2026లో తాము ఆడాల్సిన గ్రూప్ మ్యాచ్ల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బీసీబీ అభ్యర్థనను తిరస్కరించింది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఆర్థిక సంఘ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం బంగ్లా ప్లేయర్లపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆగ్రహించిన ప్లేయర్లు.. నజ్ముల్ను బోర్డు నుంచి తొలగించకపోతే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్), అంతర్జాతీయ మ్యాచ్లను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వారి డిమాండ్స్ కు తలొగ్గిన బీసీబీ.. నజ్ముల్ ను తొలగించింది.
భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్లకు భారీ ఎదురు దెబ్బ తగలనున్నట్లు సమాచారం. అక్కడి టాప్ ప్లేయర్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ కంపెనీ 'ఎస్జీ' కీలక నిర్ణయం తీసుకుందని టాక్.
కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్ను రిలీవ్ చేయాలని ‘ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)’ దాని సహ యజమాని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్కు ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ నాయకులు తప్పుబడుతున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సంబంధించి బంగ్లాదేశ్ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్గా నియమితుడైన లిట్టన్ దాస్.. ఓ హిందూ క్రికెటర్. గతంలో తన మత విశ్వాసాల కారణంగా ట్రోలింగ్కు గురైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, రానున్న ప్రపంచకప్లో బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్కు ఆయనే ప్రధాన బలం కానున్నారు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ(59) మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్షాహి రాయల్స్తో జరగాల్సిన మ్యాచ్కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.
బంగ్లాదేశ్ తరఫున వంద టెస్టులు ఆడిన ఏకైక ఆటగాడిగా ముష్ఫికర్ రహీమ్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా వందో టెస్టులో సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై పేసర్ జహనారా ఆలమ్ తీవ్ర ఆరోపణలు చేసింది. జూనియర్లను కొడుతోందని, జట్టులో అంతర్గత రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించింది. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు ఈ ఆరోపణలను ఆధారరహితమని ఖండించింది.
బంగ్లాదేశ్లో భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దు కానుంది.
జింబాబ్వే, బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించింది. నాలుగో ఇన్నింగ్స్లో 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్ట్ సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది