Home » Bandi Sanjay
జై శ్రీరామ్ నినాదంతోనే గడీలను బద్దలుకొట్టామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జై శ్రీరామ్ నినాదంతోనే పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చామని, అదే నినాదంతో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులు ఇస్తుందని కేంద్రం హోం శాఖ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ నిధులతోనే తెలంగాణ అంతో ఇంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
డీజీపీ సీవీ ఆనంద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం, వాహనాలపై బీజేపీ శ్రేణుల దాడులను మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. పట్టపగలు గూండాల్లా వచ్చి.. వాహనాలు, ఆఫీసుపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ వ్యాఖ్యానించారు.
కరీంనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
అన్నదాతల బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి బహిరంగ లేఖ రాశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేయాలని కోరుతూ లేఖ రాస్తే ఎదురుదాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని రైతులను వెంటనే ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్నదాతలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే ఆందోళన తప్పదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన హెచ్చరించారు.