Home » Bandi Sanjay
రాహుల్గాంధీ, రాజీవ్గాంధీల గురించి కేంద్రమంత్రి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదా యం ప్రకారమే సోనియాగాంధీతో రాజీవ్గాంధీ వివాహం జరిగిందని, ఆ తర్వాత సోనియాకు గాంధీ పేరు చేర్చారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
Seethakka: కేంద్రమంత్రి బండిసంజయ్పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై బండి వ్యాఖ్యలను తప్పుబట్టారు మంత్రి. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ గాంధీని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ విజన్ ఉన్న నాయకుడని తెలిపారు.
రాహుల్ గాంధీది.. బ్రాహ్మణ కుటుంబం, హిందూ మతం అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి చెప్పారు. అయితే రాజకీయం కోసం తమ కులమతాలను ఆ కుటుంబం ఎన్నడూ వాడుకోలేదన్నారు.
‘ప్రధాని మోదీ బీసీకనా..? కాదా..? రాహుల్ గాంధీ కులం, మతం, దేశం ఏంటి..? ఈ రెండు అంశాలపై రెఫరెండాన్ని కోరుతూ ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళదామా..?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్.. సీఎం రేవంత్రెడ్డికి సవాల్ చేశారు.
ప్రజల కోసం తాను రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు ఐటీఐఆర్కోసం కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్పై ఏడాదిగా ఒత్తిడి పెడుతున్నానని చెప్పారు.
ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చిచెప్పారు.
కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం బోగస్ సర్వే నిర్వహించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డులను లింక్ చేస్తూ.. ఇంటింటా రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
‘‘ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారు..? బీసీల జాబితా ఏమైనా మీ అయ్య జాగీరా..? బీసీలను ఉద్ధరిస్తామని చెప్పుకునే బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి.?
ఆప్ను ఓడించడం ద్వారా మద్యం కుంభకోణంపై ఢిల్లీ ప్రజలు విస్పష్ట తీర్పు ఇచ్చారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి అన్నారు.
Bandi Sanjay: ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు.