Home » Ayodhya Ram mandir
హైదరాబాద్: అయోధ్య రామ మందిర్ పేరుతో వచ్చే మెసేజ్లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫేక్ ప్రసాదం, వీఐపీ ఎంట్రీ పాసుల పేరుతో సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ తయారు చేస్తున్నారని...
Ram Lalla In Ravana’s Village: 500 ఏళ్ల నాటి భారతీయుల కల నిన్నటితో(జనవరి 22, 2024) తీరింది. ఇన్నాళ్లు గుడారం లాంటి మందిరంలో తలదాచుకున్న రామయ్య.. ఇప్పుడు భవ్య మందిరంలోకి అడుగు పెట్టారు. దాంతో దేశ వ్యాప్తంగా దీపావళి పండుగను మించి వేడుకలు నిర్వహించారు జనాలు. తమ ఇళ్లలో దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి రాములోరికి స్వాగతం పలికారు భక్త జనులు.
సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే ట్రెండ్కి తగినట్టు వివిధ మార్గాల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించి డబ్బులు దోచుకుంటున్న ఈ దుండగులు.. ఇప్పుడు శ్రీరాముడిని కూడా విడిచిపెట్టడం లేదు. ఆయన పేరు మీద కూడా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తికాగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 11 రోజుల ఉపవాస దీక్షను సోమవారం విరమించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ అందించిన రామ 'చరణామృతం' తాగడం ద్వారా ప్రధాన తన ఉపవాసాన్ని ముగించారు.
అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగిన రోజున దేశంలో రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAT) ప్రకారం.. రామమందిర ప్రారంభోత్సవం కారణంగా దేశంలో సుమారు రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని తేలింది.
జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా జరిగిందో అందరూ చూశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అతిరథ మహారథుల మధ్య ఒక పండుగలా ఈ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇదే సమయంలో.. ఈ వేడుకలో కొన్ని కీలక ఘట్టాలు కూడా చోటు చేసుకున్నాయి.
రామభక్తుల శతాబ్దాల కల సాకారమై అయోధ్యలోని భవ్య మందిరంలో సోమవారంనాడు కొలువైన రామ్లల్లాను ఇక నుంచి "బాలక్ రామ్''గా పిలువనున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన ట్రస్టు పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
అందరి అంచనాలూ నిజం చేస్తూ తొలి రోజున అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ సుమారు మూడు లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శనం చేసుకున్నారు.
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ప్రధాని మోదీ రామ్ లల్లా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
అయోధ్యలో బాల రాముడు కొలువుదీరాడు. ఆ రాములోరికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బహుమతులను అందజేస్తున్నారు. గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి వజ్రాలు పొదిగిన కిరీటాన్ని బహూకరించారు.