Share News

Ayodhya: అయోధ్య రామాలయాన్ని నెలరోజుల్లో ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:19 PM

అయోధ్యల రామాలయాన్ని నెలరోజుల్లో 1.10 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈ మేరకు బీజేపీ(BJP) ఎన్విరాన్మెంట్‌ టీం అధ్యక్షుడు గోపినాథ్‌ మాట్లాడుతూ...

Ayodhya: అయోధ్య రామాలయాన్ని నెలరోజుల్లో ఎంతమంది సందర్శించారో తెలిస్తే..

చెన్నై: అయోధ్యల రామాలయాన్ని నెలరోజుల్లో 1.10 లక్షల మంది భక్తులు సందర్శించుకున్నారు. ఈ మేరకు బీజేపీ(BJP) ఎన్విరాన్మెంట్‌ టీం అధ్యక్షుడు గోపినాథ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంనుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం పూర్తిచేసుకొని వెళ్లేలా తన నేతృత్వంలోని ఐదుగురితో కూడిన బృందం అయోధ్య(Ayodhya)లో ఉందన్నారు. కుంభాభిషేకం జరిగిన జనవరి 22 నుంచి ఈనెల 24వ తేదీ శనివారం వరకు చెన్నై, కోయంబత్తూర్‌, తిరునల్వేలి తదితర ప్రాంతాల నుంచి నడిపిన ప్రత్యేక రైళ్ల ద్వారా 1.50 లక్షల మంది భక్తులు రామలయ్యాన్ని సందర్శించారని తెలిపారు. అయోధ్య వచ్చే భక్తులు ఆయా జిల్లాల బీజేపీ నాయకుల ద్వారా తమ బృందాన్ని సంప్రదించాలని, వారికి అవసరమైన అన్ని వసతులు తాము కల్పిస్తామన్నారు. మార్చి 6వ తేది వరకు మాత్రమే తమ బృందం అయోధ్యలో ఉంటుందని గోపినాథ్‌ తెలిపారు.

Updated Date - Feb 26 , 2024 | 12:20 PM