Home » Australia Cricketers
ఇటీవలే ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొందరు ట్రావిస్ హెడ్ భార్య జెస్సికా డేవిస్ను, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన కామెంట్లు, బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో..
త్వరలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆల్రౌండర్ సోఫీ మోలినెక్స్ను ఆసీస్ బోర్డు ఎంపిక చేసింది.
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 198 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా ఛేదనకు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. భారత్తో ఆసీస్ మూడు వన్డేల సిరీస్ ఆడుతోంది. అందులో భాగంగా నేడు ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ఇందులో హీలీ అద్భుత సెంచరీతో అదరగొట్టింది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండో మ్యాచ్లో తలపడ్డాయి. ఈ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ గెలుపొందడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను 2-0తో దక్కించుకుంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో ఆస్ట్రేలియా జట్టు తీవ్రంగా విఫలమైంది. ఐదు సార్లు కప్ను ముద్దాడిన ఆసీస్.. ఈసారి గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒకదాంట్లోనే విజయం సాధించింది.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డామియన్ మార్టిన్.. మెనింజైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారినపడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం మార్టిన్ కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అతడు కృతజ్ఞతలు తెలిపాడు.
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అలీసా హీలీ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. రానున్న టీ20 ప్రపంచ కప్ ముంగిట హీలీ ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులతో పాటు క్రికెట్ మాజీలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు అస్టన్ అగర్, అరోన్ హర్డీ ప్రయాణిస్తున్న ఉబర్ కారు రోడ్డుపై ఆగిపోయింది. దీంతో వారు ఆ కారును తోసుకుంటూ స్టేడియానికి చేరుకున్నారు. బిగ్బాష్లీగ్లో (Big Bash League) భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్కు ముందు వారు మైదానానికి చేరుకునే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.