Home » Atchannaidu Kinjarapu
రైతు పక్షపాతి సీఎం చంద్రబాబు. రైతుకు అండగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
భవనాలు కలిగిన వారు పేద కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
మొంథా తుపాను తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ, సంబంధిత అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఈసారి కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నష్ట నివారణ చర్యలను చాలా పకడ్బంధీగా ఇప్పటికే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు.
మద్యంపై మాట్లాడే నైతిక అర్హత జగన్రెడ్డికి ఎక్కడుందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో గురువారం విలేకరులతో మంత్రి మాట్లాడారు.
పోలీస్ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టిపెడతామని మంత్రి అచ్చెన్న స్పష్టం చేశారు. పోలీసులు, వారి కుటుంబాలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. అమరవీరుల త్యాగాలు మరువలేమన్నారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్రమ ఏర్పాట్లు చేయాలని మంత్రి అచ్చెన్న ఆదేశాలు జారీ చేశారు. సభ విజయవంతం కోసం క్షేత్రస్థాయిలో సమర్థ ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు.
టమాటా రైతుల్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
వాయుగుండం ప్రభావం తగ్గిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
ఫిష్ ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వం దోపిడీకి తెగబడిందని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద...