Home » Assembly elections
అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరుకు మంగళవారం సాయంత్రంతో తెరపడింది. ఎన్నికల హామీలు, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు, స్టార్ క్యాంపెయినర్లతో ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం సాగించాయి.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సుమారు 100 స్థానాలను కైవసం చేసుకుంటుందని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ చెప్పారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన మొదటి రోజు నుంచీ తాను ఇదే చెబుతున్నానని పునరుద్ఘాటించారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై పడింది. బెంగాల్తో పాటు ఇప్పటికే ముగిసిన తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సాయంత్రం 6.30 గంటలకు వెలువడనున్నాయి.
అస్సాం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలితప్రాంత పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 వరకూ మొత్తం 823 సీట్లలో పోలింగ్ జరుగగా, కీలకమైన ఓట్ల లెక్కింపునకు కౌంట్డైన్ మొదలైంది.
ఇండియా రాజకీయ ముఖచిత్రం తిరగరాసే ఎన్నికలుగా మే 4వ తేదీ నిలువనుందా అనేది మరి కొద్ది గంటల్లోనే తేలనుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ సెంటర్ల వద్ద అంతరాయాలు కలిగించడానికి బీజేపీ పథక రచన చేస్తోందని అధికార డీఎంకే (DMK) ఆరోపించింది. పెద్దఎత్తున శాంతిభద్రతలకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.ఎస్.భారతి ఎన్నికల ప్రధానాధికారికి ఆదివారంనాడు లేఖ రాశారు.
గత కొన్ని రోజులుగా ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగియనుంది. ఈ నెల 23న పోలింగ్ జరుగనుంది.
గత ఐదేళ్లుగా రాష్ట్రాభివృద్ధికి నిధులివ్వకుండా, రాష్ట్ర హక్కులను హరించివేస్తున్న బీజేపీ పాలకులకు కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్న అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామిని, ఏఎంఎంకే నేత దినకరన్ను ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు.
చెన్నై నగరంలోని విల్లివాక్కం, విరుగంబాక్కం, కొళత్తూరు నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ సోమవారం ఉదయం నుండి రాత్రి వరకు విస్తృత ప్రచారం చేశారు.