Home » Assam
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య సీట్ల పంపకాల ఫార్ములాను ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బీజేపీ 89 సీట్లలో, భాగస్వామ్య పక్షాలైన అసోం గణ పరిషత్ 26 స్థానాల్లో, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ 11 సీట్లలో పోటీ చేయనున్నట్టు చెప్పారు.
అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 23మందితో కూడిన తన రెండో విడత అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాంలోని సిల్చార్లో శనివారంనాడు పర్యటించారు. రూ.23,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.22,864 కోట్లతో సిల్చార్-మేఘాలయలోని షిల్లాంగ్ మధ్య నిర్మించనున్న యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేకు భూమి పూజ చేశారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.
అసోంలో అదృశ్యమైన యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందారని తెలుపుతూ.. వారి పట్ల సంతాపం వ్యక్తం చేసింది.
అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్తున్న మహిళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్షాను కలుస్తామని చెప్పారు.
అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
గొగోయ్ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.