Home » AP Politics
సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రతిపక్ష హోదా కావాలని చిన్నపిల్లాడిలా జగన్ మారాం చేస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. ప్రతిపక్ష హోదా అనేది చాక్లెటో, బిస్కెటో కాదని తెలిపారు.
గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపణలు చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదల్లేదని ధ్వజమెత్తారు.
పీపీపీ విధానంపై చర్చకు రావాలనే తన ప్రతిపాదనకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని అహర్నిశలూ అనేక వ్యయప్రయాసలకు పాటుపడుతున్న జగన్ ఇకనైనా చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.
పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు.
మచిలీపట్నం పోలీసు స్టేషన్లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
PM SHRI పథకం క్రింద గ్రిడ్ అనుసంధానిత రూఫ్టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఆ పథకం ద్వారా 3550 KW ఉత్పత్తి లక్ష్యంతో 415 పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లకు పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
జగన్కి సానుభూతి నటన తప్ప రైతులపై చిత్తశుద్ధి లేదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. జగన్ పాలనలో రైతులు కన్నీళ్లు పెట్టారని విమర్శించారు.