Home » AP Politics
ప్యాలెస్లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వైసీపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మార్కాపురం పట్టణానికి 8 కిలోమీటర్లు దూరంలో ఒక లే అవుట్, 10కిలో మీటర్లు దూరంలో మరో లేఅవుట్ వేశారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి పిటిషన్పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది.
చిత్తూరు జిల్లాలో ఉన్న యూనివర్సిటీ ద్రవిడియన్ యూనివర్సిటీ అని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. భాషా సంబంధమైనది కాబట్టి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనలో గత టీటీడీ పెద్దలు గద్దల్లా స్వామి వారి సొమ్మును దోచుకున్నారని.. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ నడిచింది. మంగళవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు అంశంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ నడిచింది. ఈ సందర్భంగా..
జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులను పట్టించుకోలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రబీపంటకు పైసా కూడా బీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఐదేళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని దేవినేని విమర్శించారు.
తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డిలకి ముసళ్ల పండగ ముందుందని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.