Home » AP Politics
గత ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణను అడ్డుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు, డ్రామాలకు తెరలేపారని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు.
అమరావతి మునిగిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అతని అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఛీకొడతారని మంత్రి నారాయణ హెచ్చరించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధిని రద్దు చేయగా, చంద్రబాబు మానవత్వంతో పునరుద్ధరించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నష్టం కన్నా, జగన్ ఐదేళ్ల పాలనలోనే ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే వత్సవాయి సత్యనారాయణ వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుతున్న జగన్ కావాలని రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్మార్ట్ ఫోన్లు వచ్చాక లఘు చిత్రాలకు విపరీతమైన ఆదరణ పెరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. లఘు చిత్రాలు ప్రతి ఒక్కరిలో సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు వినోదాన్ని కలిగిస్తున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
వైసీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎలమంచిలి సురేశ్పై దాడి చేశారు. సురేశ్పై హత్యాయత్నానికి అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు మైలా శివకుమార్, పీతా నవీన్ పాల్పడ్డారు.
ఏపీ ప్రభుత్వ అద్దె హెలికాఫ్టర్పై వైసీపీ ఫేక్ ప్రచారానికి దిగింది. తప్పుడు ప్రచారంపై చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. ఏపీ ముఖ్యమంత్రికి గతంలో ఉన్న హెలికాఫ్టర్ స్థానంలోనే వేరే హెలికాఫ్టర్ను అద్దెకు తెప్పిస్తున్నారని ఏపీ ప్రభుత్వ అధికారులు వివరించారు.
ప్రతిపక్ష హోదా అడుగుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు.
వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు వారిని కించపరిచేలా ఎక్కడో పోరుగు రాష్ట్రంలో జరిగిన సంఘటన వీడియోలు పోస్ట్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో ఓర్పుతో పాఠాలు చెబుతూ విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే ప్రతి గురువు దైవంతో సమానమని మంత్రి నారా లోకేష్ అభివర్ణించారు.