Home » AP Liquor
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నిజానికి ఐదేళ్ల కిందట వైసీపీ హయాంలోనే ఈ నకిలీ మకిలి మొదలైందని, తీగలాగితే తమ డొంకా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ఆరోపణలు ఉన్నాయి.
ఇబ్రహీంపట్నంలో భారీగా కల్తీ మద్యం బయటపడిన విషయం తెలిసిందే. బయటపడిన నకిలీ మద్యానికి సంబంధించిన మూలాలు అన్నమయ్య జిల్లా మెులకలచెరువులో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిర్వహించిన సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిట్ అధికారులు తెలిపారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించేందుకు కంపెనీలను వాడుకున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. PMLA కింద ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. దేశ వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టి, పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఉన్న ఏ-4 మిథున్ రెడ్డిని సిట్ విచారించింది. కస్టడీలో తొలి రోజునే సిట్ అధికారులు ఆయనను పలు కీలక అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.