Home » AP Govt
గొడ్డలి పార్టీ నేతలు ఫండింగ్ చేసి మరీ తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పైనా విమర్శలు చేసేందుకు కొన్ని సామాజిక మాధ్యమాలకు జగన్ అండ్ కో ఫండింగ్ ఇస్తోందని ధ్వజమెత్తారు.
విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.
విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విశాఖపట్నం నుంచి వెళ్లి సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన నివాళులు అర్పించారు. వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా, ఆ స్వాతంత్య్ర సమరయోధుడికి ప్రగాఢ నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
రుషికొండ భవనాల విషయంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హిల్టాప్లోని భవనాల నిర్వహణ, ఆపరేషన్, మార్కెటింగ్ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటెస్ట్ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
వర్జీనియా పొగాకు కొనుగోళ్లపై మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని ఆక్షన్ ప్లాట్ఫారమ్లు వెంటనే ప్రారంభించాలని.. ప్రతి కంపెనీ తప్పనిసరిగా ఆక్షన్లో పాల్గొనాలన్నారు.
పీఎస్యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగులకు సంబంధించిన పదవీ విరమణ వయసుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 11 సీట్లు వచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అనే పిచ్చిచేష్టలతో ఎన్నికలకు వెళ్తే సున్నాకే పరిమితం అవుతారంటూ వ్యాఖ్యానించారు.