Home » AP Govt
ఎన్నికల కమిషన్ పథకాలకు నిధుల విడుదలను నిలిపివేసిందని హైకోర్టులో జగన్ ప్రభుత్వం లంచ్ మోషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసులో జగన్ ప్రభుత్వానికి (Jagan Govt) ఊరట దక్కలేదు. లంచ్ మోషన్ పిటీషన్పై మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
Andhrapradesh: పెన్షనర్లకు సకాలంలో పెన్షన్లు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇది దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. పెన్షనర్లు అనేక మంది మృతి చెందారని.. పెన్షనర్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అని వ్యాఖ్యలు చేశారు.
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
Andhrapradesh: ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ల్యాండ్ టైటిల్ యాక్ట్తో ప్రజల ఆస్తులకు ముప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూవివాదాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ యాక్ట్పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన ట్విట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్లో తాను బాధితుడినే అని పేర్కొన్నాడు.
Andhrapradesh: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులు షాక్ ఇచ్చాయి. నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్సలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ప్రైవేటు ఆసుపత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈనెల ఏడవ తేదీ నుంచి అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులకు డిసెంబర్లో 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉంది.
Andhrapradesh: రాష్ట్రంలో పండుటాకులపై జగన్ సర్కార్ పగబట్టింది. పెన్షన్దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండు రోజుల పెన్షన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పెన్షన్ డబ్బులు అందక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అపసోపాలు పడి బ్యాంకులకు వస్తే బ్యాంకు అధికారులు పెట్టిన రూల్స్తో పెన్షన్దారులు నీరసించిపోతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన ఎండల్లో బ్యాంకుల వద్దకు వెళ్లి పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు. అయితే అనేక మంది అకౌంట్లు ఇన్ ఆపరేట్లో ఉండటంతో పెన్షన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. పెన్షన్ కోసం పెద్ద సంఖ్యలో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. మండుటెండలతో అగచాట్లు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. అయినా సరే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి షాకులివ్వడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊహించని షాకిచ్చింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి..
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల కోసం పెన్షన్దారులు అష్టకష్టాలు పడుతున్నారు. మండుటెండలో బ్యాంకుల వద్ద పెన్షన్దారులు పడిగాపులు కాస్తున్నారు. చాలా అకౌంట్లు ఇన్ఆపరేటివ్ అయి ఉండటంతో.. అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇస్తున్నారు. చదవురాని అనేక మంది పెన్షనర్లు దరఖాస్తులు నింపేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్దారులకు రెండో రోజు కూడా తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రెండవ రోజు కూడా ఫించన్దారులు బ్యాంకుల చుట్టూ తిరుతున్నారు. పెన్షన్దారులకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో సగానికిపైగా ఇన్ఆపరేటివ్ అయి ఉన్నాయి. దీంతో అకౌంట్లను ఆపరేషన్లోకి తెచ్చేందుకు ఆధార్ కార్డు కాపీతో సహా దరఖాస్తు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు.