Home » AP Govt
వైసీపీ హయాంలో జగనన్న లే అవుట్ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నివాస యోగ్యం లేని, సముద్ర తీర భూములను కొనుగోలు చేసి పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కనుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు.
సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు.
ఐఏఎస్ అధికారి అహ్మద్బాబుపై దాఖలైన వ్యాజ్యంలో సోమవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులుకు పదోన్నతులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై శుక్రవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
భీమవరం డీఎస్పీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని బాలిక తల్లి ఆశ్రయించారు.
ఆలయాల విశిష్ఠతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణం అపూర్వమైన ఘట్టమని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్లో మనుషుల అక్రమ రవాణాపై అవగాహన పెంచేందుకు ఏపీ మహిళా కమిషన్ కీలక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాయపాటి శైలజ నేతృత్వంలో రైల్వే పోలీసులతో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మార్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
బాలికల కళాశాల ప్రాంగణంలో కోఎడ్యుకేషన్ కళాశాల ఏర్పాటు చేయడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 50 సెంట్ల స్థలంలో కళాశాల ఎలా నిర్మిస్తారని ప్రశ్నించింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్లో రెండో రోజు పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు.