Home » AP Govt
శ్రీశైలం దేవస్థానంలో ఆగస్టు 15వ తేదీ నుంచి వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాసరావు ప్రకటించారు. వీఐపీల రెఫరల్ లేఖలు 48 గంటల ముందే దేవస్థానం కార్యాలయానికి చేర్చాలని సూచించారు.
మినీ మార్ట్ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.
మత్తు రహిత సమాజమే లక్ష్యంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ గుర్తులతో ప్రకటన విడుదల చేశారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణలను రెండేళ్లలో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మరించుకున్నారు. జాతీయ పతాక గౌరవాన్ని నిలబెట్టారని కొనియాడారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు.