Home » AP BJP
విశాఖ ఉక్కు పరిశ్రమలో ఏదో జరిగిపోతోందని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న మంచిని ఎందుకు బయటకు చెప్పడం లేదని పీవీఎన్ మాధవ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాని మోదీ ప్రజల మనిషి అని... జనం మేలు కోసం ఎప్పుడూ ఆలోచనలు చేస్తారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. గత ఏడాది ఏపీకి పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జాతీయ రహదారుల కనెక్టివిటి, రైలు మార్గాల పెంపుతో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతిలను కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతోందని పీవీఎన్ మాధవ్ తెలిపారు.
కుంభమేళా తరహాలోనే రాజమండ్రి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
ఏపీ బిజెపి కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర అయింది. అయితే కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత వచ్చినట్లు కనించడంలేదు. తాజాగా గుంటూరు బీజేపీలో అసంతృప్తి సెగలు అలుముకున్నట్లు తెలుస్తోంది.
ఆజాదికా అమృత మహోత్సవం నుంచి తమ పార్టీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.