Home » Andhrapradesh
‘రమా.. అప్పుడే నన్ను వదిలి పోతివా..? నాకు పని చేతకాదు. మన బిడ్డను ఎలా సాకాలి? ఎలా బతకాలి?’ అంటూ భార్య మృతదేహంపై పడి దివ్యాంగుడైన భర్త రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడిన సంఘటన సోమవారం తిమ్మంపేట వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగింది.
తుంగభద్ర జలాశయం నుంచి పంట కాలువలకు జనవరి 10వ తేదీ వరకు నీరు వదిలేలా ఐసీసీ సమావేశంలో నిర్ణయించారు. పంట కోతలు పూర్తయ్యే వరకు వదలాలని తీర్మానించారు. శనివారం బెంగళూరులోని నీటిపారుదల శాఖ భవనంలో జలవనరుల శాఖ, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐసీసీ కమిటీ చైర్మన్ మంత్రి శివరాజ్ తంగడిగే అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్నాయక్ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లిగా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది.
పోలీసు పహారాలో పుట్టపర్తి కొనసాగుతోంది. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో పుట్టపర్తిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈనెల 19న భారత ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తికి రానున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోకి ముడి సరుకులు చేర్చేందుకు నూతన బ్యాగ్ కన్వేయర్ (బ్యాగ్ స్టాగర్) అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా శ్రీవారికి సమర్పించే అన్నప్రసాదాలు, లడ్డూలు, వడలు, ఇతర ప్రసాదాలన్నీ సంప్రదాయం మేరకు శ్రీవారి ఆలయంలోని పోటు (కట్టెల పొయ్యితో కూడిన వంటశాల)లోనే తయారవుతాయి.
టీటీడీకి సంబంధించి కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ కేసులకు సంబంధించి తిరుపతిలో ముమ్మరంగా విచారణ జరుగుతోంది. ఒకవైపు సీఐడీ.. మరోవైపు సీబీఐ భాగస్వామ్యమున్న సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది.
మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.
విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ చాంపియన్షిప్ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్(67), సి.జయశంకర్(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్, బ్రేస్ట్ స్టోక్, ఫ్రీస్టయిల్ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్కు రెండు చొప్పున సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారు.