Home » Andhrapradesh
చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9వతేదీ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ఏరియాలకు వేలాదొ కుటుంబాలు వెలుతుంటాయి. అయితే.. వీరంతా జాగ్రత్తలు పాటాంచాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.
అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్ రఫిక్, రఘురామ్ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
పందెం కోసం ఓ బాలుడు బాల్ పెన్ను మింగేసిన విషయం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే.. మూడేళ్ల క్రితం మింగిన ఈ పెన్నును వైద్యులు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి
పన్నుల వసూళ్లలో అవినీతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోది. దీనిలో బాగంగా ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ సత్ఫలితాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల మేర పన్నులు పంచాయతీరాజ్ ఖాతాకు చేరాయి. వివరాలిలా ఉన్నాయి.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.