• Home » Andhrapradesh

Andhrapradesh

AP News: కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు

AP News: కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు

మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్‌ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్‌ నుంచి రిసీవర్‌ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్‌, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

Vocational Colleges Scam: క్లాసుకు వెళ్లకుండానే ‘పాస్’...

Vocational Colleges Scam: క్లాసుకు వెళ్లకుండానే ‘పాస్’...

జిల్లాలో కొన్ని కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులో చేరితే తరగతికి హాజరుకానవసరం లేదు. పైగా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నమ్మశక్యం కావడం లేదా.. కానీ ఇది నిజం. వృత్తి విద్యా శాఖ నుంచే ఆయా కళాశాలలకు పరోక్ష సహకారం అందుతున్నట్లు ఆరో పణలు ఉన్నాయి.

Tirupati News: వృద్ధాప్యంలోనూ తగ్గేదేలే...

Tirupati News: వృద్ధాప్యంలోనూ తగ్గేదేలే...

విజయవాడలో గత ఆదివారం జరిగిన 6వ మాస్టర్స్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తిరుపతికి చెందిన ఎ.వెంకటేష్‌(67), సి.జయశంకర్‌(58) ప్రతిభ కనబరిచారు. వేర్వేరుగా బ్యాక్‌, బ్రేస్ట్‌ స్టోక్‌, ఫ్రీస్టయిల్‌ విభాగాలలో వెంకటేష్ కు నాలుగు బంగారు, జయశంకర్‌కు రెండు చొప్పున సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ కైవసం చేసుకున్నారు.

Minister Savitha: కూటమిలో బీసీలకు పెద్దపీట..

Minister Savitha: కూటమిలో బీసీలకు పెద్దపీట..

కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.

AP News: ప్రేమపేరుతో బాలికను తల్లిని చేసిన యువకుడు

AP News: ప్రేమపేరుతో బాలికను తల్లిని చేసిన యువకుడు

హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్‌గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్‌కు వస్తుండేది.

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

Education News: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల్లో సమూల మార్పులు

విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

MP BK Parthasarathy: ‘పురం’లో వందే భారత్‌ ఆగుతుంది..

వందే భారత్‌ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.

MP CM Ramesh: ముందుచూపుతోనే తక్కువ నష్టంతో బయటపడ్డాం..

MP CM Ramesh: ముందుచూపుతోనే తక్కువ నష్టంతో బయటపడ్డాం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

తిరుచానూరు.. తిరుపతి వెస్ట్‌ రైల్వే స్టేషన్‌ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్‌ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.

MLA Palle Sindhura Reddy: మరో 20 రోజుల్లో సుందర పుట్టపర్తి..

MLA Palle Sindhura Reddy: మరో 20 రోజుల్లో సుందర పుట్టపర్తి..

సత్యసాయిబాబా శత జయంతి వేడుకల నాటికి పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ.10కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మరో 20 రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి