Home » andhrajyothy
రష్మిక మందన్న... ఈసారి రెండు విధాలుగా వార్తల్లోకి వచ్చింది. తెర వెనక... తన సన్నిహితుడు, సహనటుడైన విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ జరిగిందనేది ఒకటైతే... తెర ముందు... ఈసారి పంథా మార్చి ప్రేక్షకులను భయపెట్టేందుకు ‘థామా’తో సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె పంచుకొన్న కొన్ని ఆసక్తికర ముచ్చట్లివి...
అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. అందులో భాగంగా వివిధ విభాగాల్లోని ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు.
టోక్యో నగరం. జనవరి 1. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఆనందంగా గడుపుతున్నారు. స్థానిక హోల్సేల్ చేపల మార్కెట్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఎంత ధరైనా సరే ట్యూనా చేపను వేలంలో దక్కించుకోవాలని డీలర్లు పథకాలు రచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అద్భుత నిర్మాణాలకు, ప్రకృతి వింతలకు ‘యునెస్కో’ గుర్తింపు ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ అరుదైన గుర్తింపు కోసం అన్ని దేశాలు పోటీపడతాయి. మన దేశానికి సంబంధించి ఇప్పటికే ‘యునెస్కో వరల్డ్ హెరిటేజ్’ తాత్కాలిక జాబితాలో 62 ఉన్నాయి.
ఆ రాశివారికి ఈ వారం ఆర్ధికంగా విశేష ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అన్నివిధాలా బాగుంటుందని, చిత్తశుద్ధిని చాటుకుంటారని, వ్యాపకాలు అధికమవుతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. కొత్త పనులు చేపడతారని, ఊహించిన ఖర్చులు ఉంటాయని, పెద్దమొత్తం ధనసహాయం తగదని సూచిస్తున్నారు.
‘మానసిక ప్రశాంతత కరువైంది. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి... ఇంట్లో, ఆఫీసులో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. డిప్రెషన్లోకి కూరుకుపోతున్నాను...’ ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా వినిపించే మాటలివి.
ఉప్పుగాయ అంటే ‘సాల్టెడ్ ఫ్రూట్’ లేదా ‘పికిల్’ అని! ఉప్పులో ఊరవేసి ఎండించిన కాయ ఉప్పుగాయ. ‘‘లవణ భావిత చూతాది శలాటుః’’ అని దీనికి నిర్వచనం ఉంది. చూతాది శలాటువులంటే ముదురు మామిడి కాయల్లాంటివని! ఈ కాయలను తరిగి ఉప్పు చల్లి ఊరబెట్టినది ఉప్పుగాయ!
ఆయన మూగజీవాలు, పక్షులఫొటోలు, వీడియోలు తీసి ముచ్చటపడలేదు. వాటి ఆక్రందన, ఆవేదన విన్నాడు... చూశాడు.. చలించాడు.. రాజస్థాన్లోని తాల్చప్పర్ లోని మెట్టపొలాలు, అటవీప్రాంతాలలో జంతుజాలం దాహం తీర్చేందుకు కృత్రిమ సరస్సుల్ని నిర్మించాడు.
కనుచూపుమేర నరమానవుడు లేడు.. అడుగు తీసి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. మంచు కప్పేసింది. ఒళ్లు గగుర్పొడిచే భయానక పర్వత లోయలైన హిమాలయాలు.. పర్వతారోహకులు కష్టపడి ఇంకాస్త ముందుకెళితే.. అక్కడొక ఒంటరి దాబా కనిపిస్తుంది.
మహీషుడి ఆగడాలు నానాటికీ ఎక్కువైపోతుండటంతో దేవతలంతా కలిసి వైకుంఠవాసుడి దగ్గరకు వెళ్లారు. తమకు మహీషుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నింటినీ వివరించి చెప్పారు. వైకుంఠవాసుడికి కూడా మహీషుడి సంగతి తెలిసి ఉండటంతో ఇక ఆలస్యం చేయకుండా దేవతలకు ఒక చక్కని ఆలోచన చెప్పాడు.