Home » Andhra Pradesh
ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం గ్రామంలో అక్క పెళ్లి పత్రికకు సంబంధించిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన సంజపోగు కల్యాణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నెలకు సంబంధించిన స్థూల, నికర జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు.
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు వాల్ పోస్టర్ విడుదల చేశారు.
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని నీటిని డెల్టా అవసరాలకు వాడుతున్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.