Home » Ananthapuram
పిల్లచేష్టలు ప్రాణం మీదకు వచ్చాయి. సరదాగా జరిగిన వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి ఒకరిని తీవ్ర గాయాలపాలు చేసింది. సరదాగా తొండను విసరడం.. ఇంటికి నిప్పుపెట్టడం, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు కావడం.. జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రంలో అధికారం కోల్పోయినా.. వైసీపీ కార్యకర్తల బరితెగింపు రాజకీయాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయు దాడులకు పాల్పడ్డారు. ఇప్పటికే రప్పా.. రప్పా.. అంటూ వీరంగం చేసిన ఆ పార్టీ కార్యకర్తలలు తాజాగా టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
చిత్రావతి నది నుంచి ఇసుకను పెద్దఎత్తున తోడేస్తున్నా.. సంబంధిత అధికారులు సట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఇతర వాహనాల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఇంతజరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు.
జగన్ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్ డెవల్పమెంట్ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.
అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..
జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదినేని మహేశ్ హత్య కేసును పోలీసుల ఛేదించారు. వ్యాపారంలో విభేదాలతోనే.. హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.