Home » Ananthapuram
అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి, గుంతకల్లు-బళ్లారి డబ్లింగ్ సెక్షన్లను నాలుగు లైన్లుగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ అన్ని ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే.. ఇదేగాని జరిగితే ఇక ప్రయాణం సులువుగా మారే అవకాశం ఉంది.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.
దివంగత టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన నేతగా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రేమించి పెళ్లిచేసుకొని ఇప్పుడు వద్దనడంతో.. ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థిది నెలకొంది. అలాగే పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.
అరటి సాగు చేసిన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లో రూ. 4వేల వరకు ధర తగ్గిపోవడంతో రైతలరే ఏమి చేయాలో అర్ధంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
స్వాతంత్య్ర సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పల్లెలు వెనుకబడే ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి కూడా నోచుకోని గ్రామాలు ఉండటం దారుణమైన విషయంగానే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామాని నేటికీ కనీసం మట్టిరోడ్డు కూడా లేదు.