Home » Ananthapuram
జిల్లాలోని ఆయా మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల దౌర్జన్యాలకు అంతేలేకుండా పోతోంది. ఆ పార్టీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్బంగా రప్పా రప్పా అంటూ ప్లెక్సీలు పెట్టి అలజడి చేశారు. తాజాగా మరో నాయకుడు, ఆయన కొడుకు దాడిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్న మున్వర్ బాబా గాయపడ్డాడు. గత కొద్దిరోజులుగా పట్టణంలో పలువురిని గాయపరిచినట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి.
మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడుచూడు మానవత్వం ఉన్నవాడు.. అన్న గేయం మాదిరిగా.. ఓ వ్యక్తి ప్రమాదంలో ఉన్నా.. అవేమీ పట్టించుకోకుండా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి.
వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.
నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే చర్యలుంటాయని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ... అనంతపురం నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీలు, పట్టణాలు, మండలాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.
గత కొద్దిరోజులుగా మంచు విపరీతంగా పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ పొగమంచు కారణంగా ప్రధానంగా రహదారులపై వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రధానంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సం ఇంకా గ్రామాల్లో అలజడి రేపుతూనే ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అనుమతి లేకుండా ర్యాలీ, రోడ్డుపై ధర్నాలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కాస్త దెబ్బతింటోంది. అంతేగాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
టమోటా ధర మళ్లీ పెరిగింది. మార్కెట్లో కేజీ రూ. 46కు విక్రయిస్తుండగా.. మరికొన్నిచోట్ల రూ. రూ. 55 వరకు విక్రయిస్తున్నారు. నిన్న మిన్నటివరకు ధర లేక దిగాలు పడ్డ రైతులు పెరిగిన ధరలతో కొ్ంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.