Home » Ananthapuram
కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక అయ్యారు 15వ వార్డు కౌన్సిలర్ తలారి గౌతమి. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో నలుగురు బాలికలు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.నలుగురు విద్యార్థినులు వాస్మోల్ తాగి ఆత్మహత్యయత్నం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.
పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. వీధికుక్కల సంఖ్య పెరగకుండా పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారుల్లో కదలిక వచ్చింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫైర్ అయ్యారు. రూ. వెయ్యి పెంచేందుకు ఆయనకు ఐదేళ్లు పట్టింది.. అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారంటూ ఆయన దుయ్యబట్టారు.
వీధికుక్కలతో అక్కడి ప్రజలు భయపడాల్సి వస్తోంది. ఏదైనా పనిమీద బయటకు వెళితే.. తిరిగి ఇంటికి జాగ్రత్తగా వస్తామన్న నమ్మకం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా వీధికుక్కలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేవలం మూడు నెలల్లోనే 106 కేసుల నమోదయ్యాయంటే ఇక్కడి పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
నియోజకవర్గ కేంద్రమైన ధర్మవరంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్కో ఓవర్కు ఒక్కో పందెం కాస్తున్నారు. పట్టణంలోని క్రీడా మైదానంలో జరిగే పోటీలు బెట్టింగ్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ జరిగే మ్యాచ్లో కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఉంటాయి. వివరాలిలా ఉన్నాయి.
బాలుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. మేనమామే హంతకుడు.. అని పోలీసులు నిర్ధారించారు. కొమ్మెర హర్షవర్ధన్ అనే బాలుడిని అతని సొంత మేనమామే చంపేశాడు. జిల్లా వ్యాప్తంగా సంచలనానికి దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అనుమానాస్పద స్థితిలో తల్లీకొడుకు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఉరికి వేలాడిన తల్లి మృతిచెంది ఉండగా మూడేళ్ల సహర్షను కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తగా తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.