Home » Ananthapuram
జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. హంద్రీనీవా నీటితో అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు చెరువు పూర్తిగా నిండి, మూడు రోజుల కిందట మరువ పారింది. దీనికి వర్షపునీరు తోడవటంతో ప్రవాహం పెరిగింది. ఆ నీరు అనంతపురం రూరల్ మండలంలోని రుద్రంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీలను ముంచెత్తింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక్కసారిగా విశ్వశాంతినగర్, గౌరవ్ రెసిడెన్సీస్, వికాస్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. సాయంత్రమైనా ఇదే పరిస్థితి కనిపించింది. దీంతో స్థానికులు భయభ్రాం...
ఎస్కే యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీల్లో ఎస్ఎ్సబీఎన, ఎస్ఎల్ఎన కళాశాలల జట్లు ఫైనల్కు చేరాయి. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ అంతర్ కళాశాలల మహిళల కబడ్డీ పోటీలు గురువారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు.
కరువు నేలలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నీటి వనరులే లేని మడకశిర ప్రాంతంలో కృష్ణాజలాలు ఉరకలు వేస్తున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేస్తున్నారు.
జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.
నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు అసత్యప్రచారాలు చేసే వైసీపీ నాయకులను కాలర్ పట్టుకుని నిలదీయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.
కురుపాం, అనంతపురం ఘటనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి, అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి.
అనంతపురంలో పసిబిడ్డ మృతిపై విచారణకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం ఐసీడీఎస్ శిశు గృహంలో పసికందు మృతి చెందిన ఘటనపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.