Home » Amaravati
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు రెండు పీఠాలు వైసీపీ నుంచి టీడీపీ ఖాతాలో పడ్డాయి. ఇద్దరు మహిళలు పసుపు జెండాకు జై కొట్టించి, పదవులను దక్కించుకున్నారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్గా తలారి గౌతమి, రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఎన్నికయ్యారు. రామగిరి ఎంపీపీ ఎన్నికపై కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
జిల్లా కేంద్రం అనంతపురంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ర్యాలీ నిర్వహించారు. అఖండ-2 సినిమా విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయిన సందర్భాన్ని పురష్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. అటు బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకుడు శ్రీధర్రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పుట్టపర్తిలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ఆయన అలా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు.
అమరావతిని శాశ్వత రాజధానిగా చేసేందుకు పార్లమెంట్లో ఈ సమావేశాల్లో లేదా వచ్చే సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లోనే అమరావతిపై బిల్లు పెట్టేందుకు ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు.
హిందూపురం పోలీసులు ఓ ఘరానా దొంగను పట్టుకున్నారు. అతని వయస్సు 39 సంవత్సరాలు కాగా.. ఇప్పటివరకు 55 దొంగతనాలు చేశాడు. దీంతో పోలీసులే అతడిని చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...
నకిలీ సిమెంట్ బాగోతం గుట్టురట్టయింది. గత 15 సంవత్సరాలుగా సాగుతున్న ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పంచాయతీరాజ్ సిబ్బంది పట్ల కొందరు సర్పంచ్లు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసిన వారికి సకాలంలో జీతాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
ఓ అంధ విద్యార్థి స్కేటింగ్లో అత్యంత ప్రతిభ కనబరిచి పలువురి చేత ప్రశంసలందుకుంటున్నాడు. 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. కంటి చూపు లేకపోయినా అత్యంత ప్రతిభ కనబరిచిన అతడిని పలువురు అభినందిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతి నుంచి సాయినగర్ షిర్డీకి వీక్లీ రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఈ రెండు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య వీక్లీ రైలు ఏర్పాటుచేయడం వల్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరైలు మంగళవారం నుంచి ప్రారంభమైంది.