Home » Amaravati
జిల్లాలో 9 బార్లకు రీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామ్మోహన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురంలో -3, గుంతకల్లు-2, తాడిపత్రి, గుత్తి, కళ్యాణదుర్గం, రాయదుర్గంలో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయన్నారు.
మూడేళ్ల క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్ వచ్చే డీజే శబ్దానికి ఓ యువకుడి గుండె ఆగింది. ఏడాది క్రితం హిందూపురం పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అధిక సౌండ్ ఉన్న డీజేలు వినియోగించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలియడంతో జేసీ ప్రభాకర్రెడ్డి డీఎస్పీ ఆఫీసు వద్దకు వెళ్లాడని విశ్వసనీయ సమాచారం.
ఆ మధ్య కాలంలో అటవీశాఖ రాష్ట్ర అధికారి ఒకరు హఠాత్తుగా మరణించారు. తాడేపల్లి(Tadepalli)లో ఆయన ఉండేది అద్దె ఇల్లు కావటంతో శవాన్ని అక్కడికి తీసుకురావద్దని ఇంటి యజమాని కరాఖండిగా చెప్పేశారు. దాంతో చేసేది లేక ఆయన భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులు గుంటూరు అటవీశాఖ కార్యాలయం వద్ద ఉంచి అక్కడ నుంచే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మద్యం బార్ల పాలసీ ఎక్సైజ్ అధికారు ల పాలిట శాపంలా మారిందా అంటే చోటుచేసుకుంటున్న పరిణామాలు అలాగే ఉంటున్నాయి. గతంలో మద్యం వ్యాపారం అంటే పెద్దఎత్తున పోటీ ఉండేది. ప్రభు త్వానికి దరఖాస్తుల రూపంలోనే రూ.కోట్ల తో ఖజానా నిండేది. గతంలో వైన్స్ లైసె న్సుల జారీలోనూ ఇదే పరిస్థితి. అయితే గత నెలలో బార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా వ్యాపారుల నుంచి కనీస స్పం దన లేకుండా పోయింది.
రొళ్ల మండలం కాలువపల్లి మినీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిత్రమైన పరిస్థితి కనిపించింది. కేంద్రానికి ఇద్దరంటే ఇద్దరే చిన్నారులు వస్తున్నారు. వారిలో ఒకరు గైర్హాజరయ్యారు. దీంతో ఒకే ఒక బాలుడు హాజరయ్యాడు.
దసరా, దీపావళి సందర్భంగా కొన్ని మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్లను అక్టోబరు నుంచి నవంబరు వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా స్పోర్ట్స్ అధికారుల తప్పిదంతో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒకరి స్పోర్ట్ సర్టిఫికెట్ను అదే పేరుగల మరో వ్యక్తికి గుట్టుచప్పుడు ఇచ్చారు. ఆ సర్టిఫికెట్తో డీఎస్సీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవటం.. సర్టిఫికెట్ల పరిశీలనలో బ్యాకప్ సర్టిఫికెట్లును అధికారులు అడగటంతో అసలు విషయం కాస్త వెలుగుచూసింది.
‘డీజే’.. పెళ్లి ఊరేగింపులు జరగాలన్నా, రాజకీయ నాయకులకు స్వాగతం పలకాలన్నా, దేవుళ్లను ఊరేగించాలన్నా తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని సృష్టించే డీజేలకు ప్రాధాన్యం ఎక్కువైంది.వీటి నుంచి వచ్చే అధిక శబ్దాలకు చిన్నారులు, వృద్ధులు గుండె సంబంధిత వ్యాధులున్న వారు భయంతో బిక్క చచ్చి పోతున్నారు.
కాకినాడలో రూ.5కోట్లతో నిర్మించిన బోటు బిల్డింగ్యార్డు ఎందుకు కొరగాకుండా పోయిం ది. అయిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోటంటే ఒక్క టి కూడా నిర్మాణం కాకుండా ఈసురోమంటోం ది. బోట్ల తయారీకి కావాల్సిన అన్నిరకాల సదు పాయాలు కల్పించాల్సిన అధికారులు అరకొరగా పనులు చేసి అందినకాడికి నొక్కేయడంతో దిష్టి బొమ్మలా మారింది.