Home » Amaravati
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మంత్రి నారాయణ హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.
అమరావతిలో ఒక చరిత్రను సృష్టించే విధంగా వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈనెల 11 నుంచి అటల్ మోదీ సురిపాల యాత్రను ప్రారంభించారని తెలిపారు. అమరావతిలో 14 అడుగుల వాజ్పేయ్ విగ్రహాన్ని ఆవిష్కరించామని సీఎం తెలిపారు.
వాజ్పేయి జయంతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అమరావతిలో వాజ్పేయ్ తొలి విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
మెరుగు పెడతామంటూ.. గ్రామాల్లో తిరుగుతూ బంగారం గొలుసు ఎత్తుకెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు గ్రామంలోకి వచ్చి ఇత్తడి సామాన్లకు మెరుగు పెడతామని చెబుతూ మోసాలకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
శబరిమలకు వెళ్లి వస్తూ మార్గమధ్యలో నదిలో స్నానానికి దిగి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నందకుమార్ (27) అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అయితే.. బరిమలకు వెళ్లి వస్తూ నదిలో మునిగి చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా సాగిన అటల్ - మోదీ సుపరిపాలన యాత్ర అమరావతిలోని వేంకటపాలెం వద్ద ముగియనుంది. నేడు వాజ్పేయ్ కాంస్య విగ్రహావిష్కరణతో పాటు స్మృతి వనం ప్రారంభోత్సవాలు జరుగనున్నాయి.
తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కమిటీని నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం పూర్తవగా.. మిగతా 40 మందితో కమిటీ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆపై ఇరువురు కలిసి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.