Home » ACB
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో నిందితులను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు సిట్ అధికారులు. ఈ క్రమంలో లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేపట్టింది న్యాయస్థానం.
ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇతర అధికారులు బీఎల్ఎన్ రెడ్డి, కిషన్రావు, ఎఫ్ఈవోలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు సిట్ అధికారులు. ఈ పిటీషన్పై మరికాసేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు 5 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
మత్స్యకార సొసైటీలో నూతన సభ్యత్వాలను నమోదు చేయడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు.
ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్ని ఏసీబీ కస్టడీకి తీసుకుంది. జిల్లా జైలు నుంచి ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ACB అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ సంజయ్ను విచారిస్తోంది.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై ఖిలా వరంగల్లోని తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-30 పైలా దిలీప్కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పైలా దిలీప్కు బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు షరతులు విధించింది.
సిద్దిపట జిల్లా మద్దూరు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఈసీ బండకింది పర్శ రాములు లంచం తీసుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.