Home » ABN
అయోధ్యలో రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, బద్రీనాథ్లోనూ అలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వస్తోన్న ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఆలయ ట్రస్ట్.. అంతర్గత విచారణకు ఆదేశించింది.
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఉగ్రవాదులపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఉపా చట్టం కింద కొత్తగా 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోంశాఖ ఓ గెజిట్ను విడుదల చేసింది.
కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు హనుమకొండ రజిని కుమారి, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి భావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడి బ్రిటిష్ పాలనకు సవాల్ విసిరిన మహావీరుడిగా అల్లూరి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని వ్యాఖ్యానించారు.
విజయవాడ పశ్చిమ బైపాస్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాప్రతినిధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రెండు దశాబ్దాల తన రాజకీయ, ప్రజా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజల ప్రేమ, ఆదరణ తనకు అపారమైన బలాన్నిచ్చాయని కొనియాడారు.
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. కౌంటింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని విచారణ అధికారులు (SIT) స్వాధీనం చేసుకున్నారు.
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది.
వరంగల్ నగరంలోని ప్రముఖ భద్రకాళీ ఆలయం వద్ద ఈరోజు (శనివారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తడిబట్టలతో ఆలయంలో స్నానాలు చేయడం వల్ల ఆలయం అపవిత్రమైందని ఆరోపిస్తూ, ఆలయ సంప్రోక్షణ నిర్వహించేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆలయానికి చేరుకున్నారు.