మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటన కలకలం రేపింది. కాంగ్పోక్పి జిల్లాలోని నాగా గ్రామంపై సాయుధ దుండగులు కాల్పులు జరిపి, ఇళ్లకు నిప్పంటించారు. ఈ ఘటనలో సుమారు తొమ్మిది ఇళ్లు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలను మోహరించారు.
లోక్సభ నియోజకవర్గ పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా సీఎం విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు జలశక్తి శాఖ కార్యదర్శిగా ఉన్న వీఎల్ కాంతారావుపై ఆకస్మికంగా బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అర్చనావర్మను నియమించారు..
బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్బంగా జేడీ ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి అడ్డంగా దొరికిపోయారు.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది.
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా అన్నూర్లో విషాదం చోటు చేసుకుంది. దోమల నివారణకు పురుగుమందు పిచికారీ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది.
ముంబైలో భారీ వర్షాల వేళ ఘట్కోపర్-కుర్లా రహదారి సమీపంలోని అశోక్ నగర్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు..
అయోధ్య రామమందిర వ్యవహారాలను పర్యవేక్షించే సీఈఓ ఎంపిక కోసం ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అభ్యర్థులను ఇంటర్వ్యూ పానల్ వివిధ రకాల ప్రశ్నలను అడిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావుతో మోదీ మాట్లాడుతూ..