తొలి దశ పోలింగ్లో వచ్చిన స్పందన తమకు సానుకూలంగా లేకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పర్యటనలను కుదించుకున్నారని తెలిసిందని పవన్ఖేరా చెప్పారు. పోలింగ్ జరిగిన 121 నియోజకవర్గాల్లో చాలాచోట్ల మహాగఠ్బంధన్ ముందంజలో ఉందన్నారు.
హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. యూపీ వంటి ఇతర రాష్ట్రాల వారికి కూడా హర్యానాలో ఓట్లు ఉన్నాయని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల బేరసారాలన్నీ పక్క నియోజకవర్గాల్లోకి మారాయి. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్మెంట్ను ప్రారంభించాయి. కీలకంగా ఉన్న వ్యక్తులను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే బేరసారాలకు దిగితే ప్రత్యర్థులకు తెలుస్తుందని, అడ్డాలను పక్క నియోజకవర్గాలకు మార్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారం జోరుగా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్టుగా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే ఈ ఎన్నికలో మహిళల ఓట్లు కీలకంగా మారునున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 11న ఉపఎన్నిక ఉన్న నేపథ్యంలో స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు కింది వార్తలో చదవండి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడగొడితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్ని వర్గాలను 24 నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు.
ఓటింగ్ శాతం పెరిగినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతే ఇందుకు కారణమనే అభిప్రాయం సహజంగా వినిపిస్తుంటుంది. అయితే అది అన్నివేళలా నిజం కాదని గత రెండేళ్లలో జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.