బిహార్లో తగినంత వర్క్ఫోర్స్, వనరులు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని బీజేపీ, నితీష్ ప్రభుత్వ భ్రష్టు పట్టించాయని బృందాకారత్ అన్నారు. గత 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని లూటీ చేశారని విమర్శించారు.
దేశాభివృద్ధిలో బిహార్ పాత్ర ఎంతో ఉందని, కానీ బిహార్లో మాత్రం ఆశించిన అభివృద్ధి జరగలేదని ప్రియాంక గాంధీ అన్నారు. బిహార్ పాలకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
రాష్ట్రీయ జనతాదళ్పై విమర్శలు గుప్పిస్తూ, 2005లో తాను ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టినప్పుడు బిహార్ పరిస్థితి అతి దయనీయంగా ఉండేదని, బిహారీలంటేనే చిన్నచూపు చూసే పరిస్థితి ఉండేదని నితీష్ చెప్పారు.
జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు, ఎత్తుపల్లాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అందరికీ అన్నిసార్లు అవకాశం రాకపోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ముఖ్యమంత్రి, జనతాదళ్ నేత నితీష్ కుమార్ శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో కూటమి 'సంకల్ప్ పత్ర'ను విడుదల చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని.. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయిందని ఆరోపించారు.
తేజస్వి యాదవ్ చర్యపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. నేతలే పరిశుభ్రతను పట్టించుకోకుంటే పర్యావరణం పట్ల పౌరులు జాగ్రత్తలు తీసుకుంటారని ఎలా అనుకోగలం? అని ఒక నెటిజన్ ప్రశ్నించారు.
మహాగట్బంధన్ తరఫున ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, అధికార బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతోందని విమర్శించారు. ఓటర్ అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్తో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు.
బిహార్లో సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం లేవని, కేవలం ముగ్గురు నలుగురు బీజేపీ నేతలు రిమోట్ కంట్రోల్ను తమ చేతుల్లో పెట్టుకున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.