వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై బోరే విశ్వనాథ్(31) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.
వాలెంటైన్స్డే సందర్భంగా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఆటోలో స్కూలుకు వెళుతున్న ఉపాధ్యాయురాలిపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం జరిగింది.
ఉచితంగా హోటల్ గది ఇవ్వలేదని ఓ విదేశీయుడు తన గొంతును కోసుకున్నాడు. న్యూఢిల్లీలో బుధవారం ఈ ఘటన జరిగింది. గాయాలపాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
డబ్బు కోసం తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. నిందితుడిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
‘రీల్స్ వ్యామోహం’ రెండు ప్రాణాలను బలిగొంది. రీల్స్ చేసే ప్రయత్నంలో రైలు ఢీకొని యువకుడు మృతి చెందగా, తీవ్ర మనస్తాపంతో అతని ప్రియురాలు ఆత్మహత్యకు ఒడిగట్టింది. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
ఇంటి దీపమైన తన భార్య క్యాన్సర్ కారణంగా దూరమవుతుందని ఆందోళన చెందిన ఓ వ్యక్తి... ఆమెతో పాటు తనూ తనువు చాలించాలనుకున్నాడు. అయితే తామిద్దరం లేకుంటే తమ ఇద్దరు చిన్నారుల ఆలనా పాలనా చూసేవారుండరన్న భయంతో ఆ ముగ్గురికీ విషమిచ్చి, తానూ ఉరేసుకున్నాడు.
పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.
ముద్ర లోన్ ఇప్పిస్తామంటూ సైబర్ నేరాలకు తెగబడుతున్న వరంగల్కు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.