Extension of Crop Insurance Deadline పంటల బీమా నమోదు గడువును ప్రభుత్వం పెంచింది. శనివారంతో ముగిసిన గడువును ఈనెల 31 వరకు పొడిగించింది. దీంతో జిల్లాలో ఖరీఫ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వరి ఉబాలు ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి.
నల్లమలలో పులిని చంపిన కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కనిగిరి ప్రాంతంలో విద్యాభివృద్ధికి మరో ముందడుగు పడింది. విద్యార్థులకు కేవలం తరగతి గదులు, ప్రయోగశాలలకే పరిమితం కాకుండా చదువు, వసతి, వైద్యం, క్రీడలు, వినోదం, పచ్చదనం అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలన్న లక్ష్యంతో ట్రిపుల్ ఐటీ భారీ క్యాంపస్ రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది.
పుల్లలచెరువు రెవెన్యూ కార్యాలయంలో అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొందరు అధికారులు రైతులను రాబందుల్లా పీక్కుతింటున్నారు. ఏ పని కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లేదంటే నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే
నలభై ఏళ్లుగా ఎదురుచూసిన కల.. ఎన్నోసార్లు ఆశలు పెట్టుకుని, మళ్లీ నిరాశపడిన లంక గ్రామాల ప్రజలు.. చివరకు వారి కళ్ల ముందే ఆ కల నిజమైంది. రహదారి లేక రాకపోకలకు ఇబ్బందులు పడిన కొల్లేరు లంక గ్రామాలకు తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు రాకతో గ్రామస్తుల కళ్లలో ఆనందంతో పాటూ నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరపడిన వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.
ఎయిర్పోర్ట్ నిర్మాణం ద్వారా స్థానికంగా గణనీయమైన పురోభివృద్ధి సాధించవచ్చని జీ.ఎమ్.ఆర్ గ్రూప్ పేర్కొంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో భోగాపురం విమానాశ్రయ గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది.
విజయవాడలో సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. రూ.179.50 కోట్ల రైల్వే ప్రాజెక్ట్లో రూ.7 కోట్ల బోనస్ మంజూరుకు సహకరించేందుకు రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనతో పాటు ప్రైవేట్ వ్యక్తి శ్రీచంద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు..
భూములపై బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మించి ఆస్తి పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నిందితుడు నునావత్ యుగంధర్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో పంటలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులకు పంటల బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది..
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.