వైసీపీ సభ్యుల నిరసనలతో ఏపీ శాసనమండలి వాయిదా పడింది. వైసీపీ ఇచ్చిన రెండు వాయిదా తీర్మానాలను చైర్మన్ తిరస్కరించారు.
‘నేడే చూడండి.. సరికొత్త సినిమా థియేటర్లో వారానికి మూడే మూడు షోలు. ఆలసించిన ఆశాభంగం.. కేవలం 30 మందికే సదావకాశం.. రూ.2 వేలు కట్టి సీటు కన్ఫర్మ్ చేసుకుంటే చాలు.. సెకండ్ షో తర్వాత వరుస ఆటలే..’ ఇదేదో కొత్తగా రిలీజైన పెద్దహీరో సినిమా కాదండోయ్. గుడివాడ నడిబొడ్డులోని ఓ సినిమా థియేటర్లో చివరాట ముగిశాక టీడీపీకి చెందిన ఓ యువ నాయకుడు విడుదల చేస్తున్న సరికొత్త పేకాట.
విజయవాడ పశ్చిమ బైపాస్ పనులకు మరో అడ్డంకి వచ్చి పడింది. టవర్ల ఎత్తు పెంపు పనులకు ‘రాధా’ సంస్థ నుంచి అనుమతులు రావడం ఆటంకంగా మారాయి. సదరు సంస్థ న్యాయస్థానం నుంచి స్టే తెచ్చుకోవటంతో పనులు పూర్తికావడానికి ఇంకెంతకాలం పడుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురుచూస్తున్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కల సాకారం కానుంది. ఆర్వోబీలు, ఆర్యూబీలు, మినీ ఫ్లై ఓవర్లకు లైన్క్లియర్ అయింది. రాయనపాడు రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా వర్చువల్గా జరగనుంది. విజయవాడ, కొండపల్లి రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి. మంగళవారం రైల్వే డీఆర్ఎం మోహిత సోనాకియాతో జరిగిన సమావేశం నేపథ్యంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే ప్రాజెక్టుల జాబితా ఖరారు చేశారు. ఆ వివరాలను మీడి యా సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. - (ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం)
లవర్ కోసం ప్రైవేట్ ట్రావెల్ బస్ సిబ్బందిపై ఓ యువకుడు దాడి చేశాడు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నకిలీ మద్యం కేసులో నిందితుడు సుదర్శన్కు బెయిల్ మంజూరైంది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువుల్లో నకిలీ మద్యం తయారు చేసినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి.
ఏపీ అసెంబ్లీ ఉద్యోగి బీకే మునిరాజాని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి విజయవాడ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది.
ధవలేశ్వరం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం రూ.150 కోట్లు మంజూరు చేసినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. పాడైపోయిన గేట్లను తొలగించి కొత్త గేట్లను అమర్చనున్నట్ల ఏపీ అసెంబ్లీలో మంత్రి తెలిపారు..
ఇండియాలోనే పీపీపీ మోడల్లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే డీఆర్ఎంతో ఎంపీ భేటీ అయ్యారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రెవెన్యూ లోటును తగ్గించడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తుపై నమ్మకం పెరిగిందని ఆయన అన్నారు.