దేశంలో గల 11 పార్టీల సభ్యులు లోక్సభ, రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. వైసీపీ మాత్రం అమరావతిని వ్యతిరేకించి.. సమయం ఇవ్వలేదని కొత్త పల్లవిని పాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఉభయసభల్లోనూ అమరావతికి చట్టబద్ధత లభించడం ప్రజా విజయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
మచిలీపట్నం కొబ్బరితోట ఘటనలో తనపై పోలీస్ కేసు నమోదు కావడంపై పేర్ని నాని స్పందించారు. తప్పుచేసే పోలీస్ అధికారులను ప్రశ్నించడం తప్పా అని ఆయన జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షుణ్ని నిలదీశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ను వెనక నుంచి గుర్తుతెలియని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మైనర్లు మృతిచెందారు.
గుడ్ ఫ్రైడే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రేమ, త్యాగం, విశ్వాసం తదితర సుగుణాలను ప్రపంచ మానవాళికి పరిచయం చేసిన ఏసుక్రీస్తు బోధనలు ఈనాటికీ అనుసరణీయమని సీఎం అన్నారు.
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పోలీస్ సంఘం ఫిర్యాదు మేరకు మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బందరులోని స్థానిక పోలీసుల పట్ల మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదని ఆయన అన్నారు.
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా సంబరాలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు.
రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు.