నెల్లూరులో జరగాల్సిన మహానాడు కార్యక్రమాన్ని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్బ్యూరో సభ్యులు, తదితర ముఖ్య నాయకుల సమక్షంలో నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో క్లస్టర్స్ వారీగా స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఇంధన పొదుపు మీద ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని, పగటిపూట మన ఇంటిపైనే సౌరశక్తి ద్వారా విద్యుత్ను తయారుచేసుకుని వినియోగించుకోవాలని సీఎం చెప్పారన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించాలని అధికారులకు మంత్రి కొల్లురవీంద్ర సూచించారు. గ్రామ వార్డు, సచివాలయాల వారీగా ప్రతినెల మూడో శనివారం ఈ కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేశ్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంధన పొదుపు చర్యల్లో అందరూ భాగస్వామ్యం కావాలని కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. బ్యాటరీ బైక్లే కాదు.. బ్యాటరీ సైకిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ సైబర్ గార్డ్ ఆపరేషనల్ ప్లాన్తో పాటు సైబర్ క్రైమ్ నిర్వహణ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణపై ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు (శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ కొత్త సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో జరిగిన షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఓ రోగికి శస్త్రచికిత్స అనంతరం తొలగించిన కాలి భాగాన్ని కుక్క నోట కరుచుకుని ఆస్పత్రి బయట తిరిగిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయాణంలో ఏఎంసీఏ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీకాలం మరో ఆరు నెలలు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఆయన సీఎస్గా కొనసాగనున్నారు.
ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్ నాటికి ఓఅండ్ఎం పనులు పూర్తిచేసేలా సీఈ స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.