వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని చూస్తుంటే, జగన్ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరు అందరికీ తెలుసన్నారు.
ఏపీలో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా, ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ ఉత్పత్తిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
సాయికృష్ణ లాకప్డెత్ కేసులో మరో ఇద్దరు పోలీసులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో నిందితులుగా ఉన్న కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు.
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీటిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ విడుదల చేశారు. ఎగువన వర్షాలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు పులిచింతల ప్రాజెక్టులోని నీటిని డెల్టా అవసరాలకు వాడుతున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హెడ్కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోతర్లంక అశోక్ కుమార్, జంగం నాని నిజాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు.
విజయవాడలోని బీబీగూడెం వద్ద ఉన్న పశ్చిమ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును కంటైనర్ వెనక నుంచి ఢీకొట్టడంతో.. ముందున్న ట్యాంకర్ను కారు బలంగా ఢీకొట్టింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్కు మరోసారి చుక్కెదురైంది. తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ సునీల్ కుమార్ దాఖలు చేసిన తుది పిటిషన్ను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(CAT) కొట్టేసింది.