Home » Andhra Pradesh » Guntur
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహానాడును వర్చువల్గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో15 వేల మంది ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల, సొసైటీ పాఠశాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రంగం సిద్ధమైంది.
మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో స్పోర్ట్స్ కోటాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారు. దీనిపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థ సీఈవో రాబిన్ ఖుదాను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. సోమవారం ముంబయిలో ఎయిర్ ట్రంక్ సీఈవోతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ డాక్యుమెంట్లతో దోచుకునేందుకు బ్రహ్మనాయుడు ప్రయత్నించారని ఫైర్ అయ్యారు.
సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత బ్యాడ్మింటన్కు మరో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఈ స్టార్ జంట దేశానికి గర్వకారణంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం (జూన్1వ తేదీ) నుంచి పని చేయడం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం స్పందించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్పీపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతుండడం పట్ల ఆదివారం అమరావతిలో ఆయన హర్షం వ్యక్తం చేశారు.