దిమాగీ నక్సల్.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కొత్త పార్టీ.. |

ABN, Publish Date - Aug 18 , 2026 | 09:48 AM

సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని.. దిమాగీ నక్సల్స్ మాత్రం మిగిలారంటూ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు.

ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): సాయుధ నక్సల్స్‌ను నిర్మూలించామని.. దిమాగీ నక్సల్స్ మాత్రం మిగిలారంటూ ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా కొత్తపార్టీ పుట్టుకువచ్చింది. మోదీ ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే దిమాగీ నక్సల్ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో తెరిచిన పార్టీ ఖాతాలకు అనూహ్య ఆదరణ లభించింది. ఇన్‌స్టాలో 1.81 లక్షలమంది, ఎక్స్‌లో 7000 మంది ఆ ఖాతాలను అనుసరించారు. ఇన్‌స్టాలో దిమాగి నక్సల్ జనతా పార్టీ అనే పేరుతో ఖాతాలు తెరిచారు.

Updated at - Aug 18 , 2026 | 10:05 AM