డీఎస్పీ భీమ్రెడ్డికి 14 రోజుల రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు!
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:53 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ (DSP) భీమ్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, జులై 7: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ (DSP) భీమ్రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ (ACB) అధికారులు ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం భీమ్రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఆయన్ను గట్టి భద్రత నడుమ చంచల్గూడ జైలుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బామ్మ డెడ్లిఫ్ట్.. వీడియో వైరల్
నడి రోడ్డుపై నటుడు పడవ ప్రయాణం.. వీడియో వైరల్
For More Viral News And Telugu News