నిజామాబాద్ జిల్లా సిరిపూర్ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు!
ABN , Publish Date - May 27 , 2026 | 02:47 PM
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా, మే 27: జిల్లాలోని మోపాల్ మండలంలో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. మండల పరిధిలోని సిరిపూర్ గ్రామంలో రాత్రి వేళ చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. గ్రామ శివార్లలో ఉన్న ఒక పశువుల పాక సమీపంలోకి చిరుత రావడాన్ని గమనించిన ఓ కుక్క గట్టిగా మొరగడంతో, చిరుత అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయింది. అయితే, ఈ దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ (CC TV) ఫుటేజ్లో స్పష్టంగా రికార్డు కావడంతో సిరిపూర్ గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు రావడానికి, పొలాలకు వెళ్లడానికి రైతులు, కూలీలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, గ్రామంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని, తమకు రక్షణ కల్పించాలని సిరిపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
విజన్ పాలిటిక్స్కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News