సాఫ్ట్వేర్ సూసైడ్ కేసులో ట్విస్ట్.. భర్త చనిపోయిన నెల రోజులకే భార్య పెళ్లి..
ABN , Publish Date - May 01 , 2026 | 07:34 PM
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారామ్ సూసైడ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, భర్త చనిపోయి నెల రోజులు కాక ముందే ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: భర్త చనిపోయి నెల రోజులు కాకముందే ఓ మహిళ తన ప్రియుడిని వివాహం చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది. భార్యకు పలువురితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్న భర్త.. ఆమె మోసాన్ని భరించలేక ఇటీవల ప్రాణాలు తీసుకున్నాడు. తాను ఎంతో ప్రేమించిన భార్యను ఇతరులతో చూసి తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, భర్త చనిపోయి నెల రోజులు కాక ముందే ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
బాచుపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారామ్ సూసైడ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. భార్య మోసం చేసిందంటూ ఫిబ్రవరి నెలలో హుస్సేన్ సాగర్లో దూకి టెకీ ప్రాణాలు తీసుకున్నాడు. అతనికి సంబంధించిన 19 పేజీల సూసైడ్ నోట్ సంచలన విషయాలు వెల్లడించింది. తన భార్యకు ఆరుగురితో వివాహేతర సంబంధం ఉందని, వాటిని కళ్లాలా చూసి తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు బాధితుడు తెలిపాడు. భార్యపై ఎంతో నమ్మకం పెట్టుకున్నానని, ఆమె మాత్రం సోషల్ మీడియాలో పరిచయమైన యువకులతో తిరుగుతూ మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. వారితో ఆమె సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను చూసి తాను భరించలేకపోయినట్లు లేఖలో పేర్కొన్నాడు. కాగా, టెకీ సీతారామ్ ఆత్మహత్య గత నెలలో ప్రకంపనలు సృష్టించింది. మరోవైపు తమ కోడలి వల్లే కుమారుడు మృతిచెందాడంటూ బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, సీతారామ్ మృతిచెంది నెల రోజులు కాకముందే అతని భార్య తన ప్రియుడిని పెళ్లాడింది. వీరి వివాహం స్థానికులు, ఇరు కుటుంబాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో బాచుపల్లి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సీతారామ్ భార్యను, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. వివరాలు వెల్లడించిన ఎంపీ అరుణ..
టెండర్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..