Share News

ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు

ABN , Publish Date - Jul 19 , 2026 | 07:36 PM

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షా భావ పరిస్థితులతోపాటు సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. 10 జిల్లాలకు స్పెషల్ ఐఏఎస్‌లు
TG Govt

హైదరాబాద్, జులై 19: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షా భావ పరిస్థితులతోపాటు సీజనల్ పరిస్థితుల పర్యవేక్షణకు 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా వర్షపాతం, తాగునీటి లభ్యత, భూగర్బ జలాలు, వ్యవసాయ పంటల పరిస్థితి, విద్యుత్ సరఫరాపై ఈ అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. జులై 20న వీరంతా జిల్లాల పర్యటనకు వెళ్లాలని ప్రభుత్వం జారీ చేసిన ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక అధికారులు.. మంత్రులు, కలెక్టర్లతోపాటు జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు. త్వరలో వీరితో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.


పాత 10 జిల్లాలకు ఒక్కో స్పెషల్ ఆఫీసర్ నియామకం..

  • హైదరాబాద్‌ జిల్లా: జయేష్ రంజన్

  • రంగారెడ్డి జిల్లా: వికాస్ రాజ్

  • కరీంనగర్‌ జిల్లా: బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా

  • మెదక్‌ జిల్లా: ఎ.వాణి ప్రసాద్

  • నిజామాబాద్‌ జిల్లా: యోగితా రాణా


  • నల్గొండ జిల్లా: హరిచందన దాసరి

  • ఆదిలాబాద్‌ జిల్లా: ఇలంబరితి కె

  • వరంగల్‌ జిల్లా: ఎ. శ్రీదేవసేన

  • మహబూబ్‌నగర్‌ జిల్లా: వి.పి.గౌతమ్

  • ఖమ్మం జిల్లా అనుదీప్ దురిశెట్టి


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌నినో ఎఫెక్ట్: తెలంగాణలో జలసిరిపై మంత్రి సీతక్క ఫోకస్

రైతులకు నీళ్లు ఇచ్చేదాకా.. వదిలిపెట్టం: హరీశ్ రావు

For More TG News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 07:48 PM