Share News

రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:27 AM

తెలంగాణలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరికి తెగబడింది.

రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చోరీ కేసు.. పోలీసుల అదుపులో నేపాలీ గ్యాంగ్
Malkajgiri Theft Case

హైదరాబాద్, జూన్ 5: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మల్కాజిగిరి చోరీ కేసులో నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో(మే నెల) మల్కాజిగిరి పరిధిలోని రిటైర్డ్ ప్రొఫెసర్ నివాసంలో నేపాలీ ముఠా భారీ చోరీకి తెగబడింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు కీలక సూత్రధారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా మరో నలుగురిని పుణేలో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురు సభ్యులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వీరిని ప్రస్తుతం పుణె నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు మల్కాజిగిరి పోలీసులు తెలిపారు.


రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో రాత్రి సమయంలో చొరబడిన నేపాలీ గ్యాంగ్.. లక్షల రూపాయల విలువైన నగలు, నగదు, ఇతర వస్తువులను అపహరించింది. ఈ చోరీ హైదరాబాద్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. వెంటనే కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లు, సెల్‌ఫోన్ లొకేషన్ డేటా ఆధారంగా గ్యాంగ్‌ను ట్రాక్ చేశారు. నేపాలీ ముఠా దేశంలోని వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.


ఇవి కూడా చదవండి..

భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

మైత్రీవనం అగ్నిప్రమాద ఘటన.. మరోసారి ఆధారాలు సేకరించనున్న క్లూస్ టీమ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 12:30 PM