Share News

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్

ABN , Publish Date - Mar 12 , 2026 | 06:49 PM

హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

ఆస్తి పన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్
GHMC Property Tax News

హైదరాబాద్, మార్చి 11: హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) గొప్ప శుభవార్త చెప్పింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించేవారికి భారీ ఊరటనిస్తూ.. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’(OTS)ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-26 సంబంధించి ఆస్తి పన్నును ఈ నెల 31వ తేదీలోకా చెల్లిస్తే, వడ్డీపై ఏకంగా 90 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు జీహెచ్ఎంసీ వెల్లడించింది.


ఆస్తిపన్ను బకాయిలను ww.ghmc.gov.in పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. అలాగే MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలోనూ చెల్లించవచ్చు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ మేరకు కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆస్తి పన్నుకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్‌ వచ్చిందంటే.. హాలీవుడ్ వచ్చినట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

గ్యాస్ సంక్షోభం.. ప్యానిక్ బుకింగ్‌తో సర్వర్లు డౌన్

For More TG News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 07:00 PM