Share News

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే

ABN , Publish Date - Jun 21 , 2026 | 02:04 PM

జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా భారత వన్డే జట్టును ప్రకటించింది.

ఇంగ్లండ్‌ పర్యటన.. భారత వన్డే జట్టు ఇదే
India ODI squad

ఇంటర్నెట్ డెస్క్: జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా భారత వన్డే జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో ఈ సిరీస్ సన్నాహకంగా నిర్వహించనున్నారు. కాగా గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చారు. కాగా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్ ఆధారంగా తుది జట్టులో చోటు కల్పించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.


ఇంగ్లండ్ పర్యటనకు భారత వన్డే జట్టు ఇదే:

శుభ్‌మన్‌ గిల్‌(కెప్టెన్), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ*, శ్రేయస్‌ అయ్యర్‌(వైస్ కెప్టెన్), కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌, బ్రార్.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ విఫలమవ్వాలని కోరుకుంటున్నారు: కైఫ్

ఫైనల్: సునామీ ఇన్నింగ్స్.. లంక బౌలర్లను వేటాడిన వైభవ్!

Updated Date - Jun 21 , 2026 | 02:07 PM