Share News

ఇంగ్లండ్ చేతిలో ఓడిన పాక్.. ఆ విచిత్రం జరిగితే సెమీస్‌కు పక్కా..!

ABN , Publish Date - Feb 25 , 2026 | 07:50 AM

టీ20 ప్రపంచ కప్-2026 సూపర్-8పోరులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఓటమితో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి.

ఇంగ్లండ్ చేతిలో ఓడిన పాక్.. ఆ విచిత్రం జరిగితే సెమీస్‌కు పక్కా..!
Pakistan vs England

స్పోర్ట్స్ డెస్క్: టీ-20 ప్రపంచ కప్-2026 సూపర్-8పోరులో ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైంది. నిన్న(బుధవారం) పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ సేన రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రారంభం నుంచి మ్యాచ్ ఉత్కంఠ రేపినా.. చివరకు ఇంగ్లీష్ జట్టునే విజయం వరించింది. ఈ ఓటమితో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ పాక్ సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఓ విచిత్రం జరిగితే పాక్ సునాయసంగా సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోవచ్చు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


సూపర్-8లో భాగంగా పాకిస్థాన్‌కు శ్రీలంకతో జరిగే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇంగ్లాండ్ ఫిబ్రవరి 27న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా శ్రీలంకపై గెలిచి.. ఇతర జట్ల విజయాల కోసం ఎదురు చూడాలి.


పాకిస్థాన్ సెమీస్‌కు చేరే ఛాన్సులు ఇవే..

ఛాన్స్-1: పాకిస్థాన్.. తన చివరి మ్యాచ్ శ్రీలంకపై తప్పనిసరిగా గెలవాలి. ఇదే సమయంలో ఇంగ్లండ్, శ్రీలంక చేతుల్లో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. అప్పుడు పాకిస్థాన్ 3, శ్రీలంక 2, న్యూజిలాండ్ 1 పాయింట్‌తో టేబుల్ పట్టికలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. ఈ పరిస్థితిలో గ్రూప్-2 నుంచి రెండో స్థానంలో నిలిచిన జట్టుగా పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరుతుంది.

ఛాన్స్-2: న్యూజిలాండ్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడి.. పాకిస్థాన్ శ్రీలంకపై భారీ తేడాతో గెలవాలి. అలా అయితే.. పాకిస్థాన్, కివీస్ జట్లు రెండూ 3 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాక్ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఛాన్స్-3: పాక్, శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాక్ కు 2 పాయింట్లు వస్తాయి. ఇదే సమయంలో శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావాలి. అలానే ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడాలి. ఇవ్వన్నీ జరిగితే.. పాక్, శ్రీలంక, కివీస్ జట్లు రెండేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్లలో మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న జట్టు గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో కలిసి సెమీస్‌కు చేరుతుంది.


గ్రూప్-2 ప్రస్తుతం పాయింట్ల పట్టిక

  • ఇంగ్లండ్ – 4 పాయింట్లు , నెట్ రన్‌రేట్ +1.491

  • న్యూజిలాండ్ – 1 పాయింట్, నెట్ రన్‌రేట్ 0

  • పాకిస్థాన్ – 1 పాయింట్, నెట్ రన్‌రేట్ -0.461

  • శ్రీలంక – 0 పాయింట్లు , నెట్ రన్‌రేట్ -2.550


ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 08:29 AM