వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్లు: భారత జట్లను ప్రకటించిన బీసీసీఐ
ABN , Publish Date - Sep 16 , 2026 | 09:09 PM
వెస్టిండీస్-భారత్ మధ్య జరగబోయే సిరీస్ల కోసం బీసీసీఐ వన్డే, టీ20 జట్లను తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి మూడు వన్డేలు, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20లు జరగనున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్-భారత్ మధ్య జరగబోయే సిరీస్ల కోసం బీసీసీఐ వన్డే, టీ20 జట్లను తాజాగా ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి మూడు వన్డేలు, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20లు జరగనున్నాయి. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు చోటు దక్కలేదు. ఇరాని కప్లో బిజీగా ఉన్న రిషభ్ పంత్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు.
భారత వన్డే జట్టు:
శుభ్మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, బ్రార్, సిరాజ్, ఆకిబ్ నబి, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్
భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2027: భారత్లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్లు!
యూఎస్ ఓపెన్ ఫైనల్లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా