2,000 కి.మీ దూరం ప్రయాణించిన పావురం
ABN , Publish Date - May 07 , 2026 | 12:47 PM
తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని ‘రాయల్ రేసింగ్ పీజియన్ క్లబ్ ఆఫ్ దిశయన్విలై’ ఆధ్వర్యంలో లక్నో నుంచి తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి వరకు సుమారు 2,000 కి.మీ దూరం పావురాళ్ల పోటీ నిర్వహించారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లాలోని ‘రాయల్ రేసింగ్ పీజియన్ క్లబ్ ఆఫ్ దిశయన్విలై’ ఆధ్వర్యంలో లక్నో నుంచి తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి వరకు సుమారు 2,000 కి.మీ దూరం పావురాళ్ల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, విరుదునగర్, మదురై, రామనాథపురం తదితర జిల్లాలకు చెందిన 17 పావురాలు పాల్గొన్నాయి.
గత నెల 2వ తేది నుంచి లక్నో నుంచి ఈ పోటీ ప్రారంభమైంది. ఈ పోటీలో పాల్గొన్న సయ్యద్ అహ్మద్ ఇబ్రహీంకు చెందిన ‘యూసఫ్’ అనే పావురం 31 రోజులు సుమారు 2,000 కి.మీ ప్రయాణించి కోవిల్పట్టి చేరుకుంది. విజేత పావురం యజమానికి బహుమతి, ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేసి అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పలు వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్ల ఏర్పాటు..
Read Latest Telangana News and National News